సదాశివపేట, డిసెంబర్ 15 (SNM న్యూస్):
సదాశివపేట పట్టణంలోని పీఎంఆర్ క్యాంపు కార్యాలయంలో కంది గ్రామానికి చెందిన మన్నే మల్లేష్ తన మిత్రులతో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు ని కలిసి వారిని శాలువాతో సన్మానించి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేశారు. ఇట్టి సందర్బంగా మల్లేశం మాట్లాడుతూ పి. ఎం. ఆర్ జనం మెచ్చిన నాయకుడని, వారు చేసిన సేవలు ఎన్నటికీ మరువలేమని, రాబోయే రోజుల్లో మా నాయకునికి మంచి అవకాశాలు రావాలని మేమందరం మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తామన్నారు. ఇట్టి కార్యక్రమంలో కంది గ్రామస్థులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment