నిజామాబాద్, డిసెంబర్ 10 (SNM న్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమైన విషయమై నిరంకుశ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా, వర్నిలో ఆటో బతుకుల రాష్ట్ర సభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తీసుకువచ్చిన ఉచిత బస్సు వలన తమ బతుకులు ఎలా చిద్రమయ్యాయో తెలుపుతూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 లో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన, ప్రత్యేక ఆటో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి 1000 కోట్ల బడ్జెట్ను కేటాయించాలి. సంవత్సరానికి కాకుండా ప్రతి నెల ఆటో డ్రైవర్లకు 12 వేల రూపాయలను అందించాలి. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం ద్వారా ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఆర్థిక నష్టపరిహారాన్ని అందజేయాలి అలాగే కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ కార్యదర్శి అధ్యక్షులు మంద రవి కుమార్, ఉపాధ్యక్షులు చోటు భాయ్ (దస్తగిర్), రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడాల సాయిలు పాల్గొన్నారు. వారితో పాటు సాదిక్, జాన్ ,రఫీక్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment