Wednesday, September 17, 2025

సంగారెడ్డిలో ఒకే బండిపై కలిసి ప్రయాణించిన జగ్గారెడ్డి దంపతులు

 

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 17 (SNM NEWS): సంగారెడ్డి రాజకీయాల్లో జగ్గారెడ్డి అనే పేరు వినగానే వెంటనే ఒక ప్రత్యేకమైన ప్రజా ప్రతిరూపం గుర్తుకు వస్తుంది. తన ప్రజాభిమానానికి పేరుగాంచిన ఆయన, కఠినమైన రాజకీయ లాంఛనాలకు కట్టుబడి ఉండకుండా సాధారణ ప్రజలతో సులభంగా కలిసిపోవడం ద్వారా తన ప్రత్యేకతను చాటుకుంటూ ఆయన శైలి ఎల్లప్పుడూ ప్రజల హృదయాలను హత్తుకునేలా మసలుకుంటాడు. బుధవారం సంగారెడ్డి పట్టణంలో అరుదైన సన్నివేశంలో, జగ్గారెడ్డి తన భార్య టిజిఐఐసి చైర్‌పర్సన్ నిర్మలతో కలిసి స్థానిక చెరువులను పరిశీలించడానికి స్కూటీ రైడ్‌కు బయలుదేరారు. అధికారిక వాహనాలు, కాన్వాయ్‌లను పక్కనపెట్టి, తన భార్యతో ఒకే ద్విచక్ర వాహనంపై ప్రయాణించడం ద్వారా, ఆయన సంగారెడ్డి ప్రజల మనసును గెలుచుకున్నారు. సంగారెడ్డి పట్టణంలోని చెరువుల సుందరరీకరణ పనులు పరిశీలనలో భాగంగా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆయన సతీమణి టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ఒకే స్కూటీపై వెళ్లారు. కంది కిసాన్ చెరువుతోపాటు, చిమ్నాపూర్ చెరువు, దేవుని చెరువులను పరిశీలించారు. కంది నుంచి సంగారెడ్డి వరకు ఐబీ వరకు భర్త జగ్గారెడ్డి స్కూటీ నడిపిస్తుంటే వెనకాల కూర్చున్న నిర్మల నవ్వుతూ ముచ్చట్లు పెట్టారు. ఆ స్కూటీ వెనకాలే పార్టీ నాయకులు, అధికారులు ముందుకు సాగారు. పట్టణ ప్రజలు ఆకస్మిక ప్రయాణాన్ని ఆసక్తిగా తిలకించారు. 40 ఏళ్ల తర్వాత ఇలా ఒకే బండిపై కలిసి ప్రయాణించడం ఎంతో మధురానుభూతిని మిగిల్చిందంటూ జగ్గారెడ్డి దంపతులు మురిసిపోయారు.

No comments:

Post a Comment

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...