Friday, June 05, 2026

అత్యాధునిక సదుపాయాలతో రాయల్ కార్ వాష్ సెంటర్ ప్రారంభం

 

సంగారెడ్డి, జూన్ 4: సంగారెడ్డి పట్టణంలోని మల్కాపూర్–రాజంపేట రహదారి మధ్యలో నూతనంగా ఏర్పాటు చేసిన రాయల్ కార్ వాష్ సెంటర్‌ను మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనిత సంతోష్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొని సంస్థ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని, ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్ వాష్ సెంటర్ యాజమాన్యం మాట్లాడుతూ అత్యాధునిక యంత్రాలు, సాంకేతిక సదుపాయాలతో అన్ని రకాల కార్లకు నాణ్యమైన వాషింగ్ సేవలు అందిస్తున్నామని తెలిపారు. వినియోగదారులకు వేగవంతమైన, మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ సోహెబ్, ఎం.డి. అబ్బాస్, సయ్యద్ షాహిద్ పాషా, ఎం.డి. విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్‌కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...