సంగారెడ్డి ప్రతినిధి మార్చి 03 (SNM న్యూస్): సదాశివపేట పట్టణంలోని పి.ఎం. ఆర్ క్యాంపు కార్యాలయంలో సాధారణ మున్సిపల్ ఎన్నికలలో 12 వ వార్డునుండి గెలిచినటు వంటి పులిమామిడి మమత రాజు దంపతులను ఉషాకిరణ్ యూత్ సభ్యులు శాలువాలతో మరియు పూల మాలలతో ఘనంగా సన్మానించారు. ఇట్టి సందర్భంగా బామిని రవి కుమార్ మాట్లాడుతూ మా చిన్నానాటి మిత్రుడు పులిమామిడి రాజు రానున్న రోజుల్లో రాజకీయంగా మరింత ఎత్తుకు యెదగాలని వారు ఇట్టి సందర్భంగా గుర్తు జేశారు. ఇలాంటి మంచి మిత్రుడు మాకందరికి దొరకడం మా పూర్వజన్మ సుకృతమని బామిని రవి మరియు బుసరెడ్డి పల్లి వెంకటేశం అన్నారు. అదేవిధంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ ఇంత చక్కటి మిత్రులు నా వెన్నంటు ఉండి ముందుకు నడిపిస్తున్నందుకు ఉషాకిరణ్ యూత్ సభ్యులందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు, సభ్యులు, మరియు పి. ఎం. ఆర్ యువసేన నాయకులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment