Friday, December 19, 2025

సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

 

సంగారెడ్డి, డిసెంబర్‌ 19 (SNM NEWS): సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ విజయ శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణాన్ని ప్రత్యేకంగా అలంకరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ గాయత్రి, డాక్టర్ పరుశురాం, డాక్టర్ విష్ణు, ఇన్‌చార్జి నర్సింగ్ తేజ సిస్టర్‌తో పాటు ఇతర సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ పండుగ సందేశాన్ని అందరికీ పంచుతూ, సేవా భావనతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరాన్ని వైద్యులు వెల్లడించారు.

No comments:

Post a Comment

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...