Sunday, December 21, 2025

సంగారెడ్డి లో నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో గంజి మైదాన్ గాంధీ విగ్రహం వద్ద దీక్ష

సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): పనికి ఆహార పథకం పేరు లో నుండి మహాత్మా గాంధీ పేరు ను తొలగించిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం చర్యను నిరసిస్తూ ఆదివారం  సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గంజి మైదాన్ గాంధీ విగ్రహం వద్ద దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథి గా టిజిఐసిసి  చైర్మెన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతి పిత మహాత్మా గాంధీ పేరు తొలగించాలానే కుట్ర చేస్తున్నారని అన్నారు.  దేశ స్వాతంత్య్రం కోసం తన జీవితాన్ని ధారపోసిన వెక్తి మహాత్ముడు గాంధీ ని అవమానించిన బీజేపీ ని ప్రజలు క్షేమించరని అన్నారు. దేశ స్వాతంత్య్రం లో ఒక్క బీజేపీ నాయకుడు పాల్గొనలేదు అన్నారు. బీజేపీ ప్రభుత్వం గాడ్సే ఆశయాలతో ముందుకు సాగుతుంది. అన్నారు.  ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ ఆంజనేయులు, టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘు గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, బుచ్చి రాములు, కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, బొంగుల రవి, ప్రవీణ్, నర్సింహారెడ్డి, మహేష్, తాహిర్, కసిని రాజు, నవాజ్, ఆరిఫ్, బాబు, తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...