Wednesday, December 17, 2025

ఇంద్రేశంలో కార్యక్రమాల సమాచారం కాంగ్రెస్ నాయకులకు ఇవ్వడం లేదు: ఆత్మ కమిటీ డైరెక్టర్ మన్నె లక్ష్మి

 

పటాన్ చెరు, డిసెంబర్ 17 (SNM NEWS): ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు కాంగ్రెస్ నాయకులకు కమిషనర్, అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వడం లేదని పటాన్ చెరు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, ఆత్మ కమిటీ డైరెక్టర్ మన్నె లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అధికారిక సమావేశాలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మున్సిపల్ కమిషనర్, అధికారులు ఎలాంటి సమాచారం అందించడం లేదని ఆరోపించారు. ఇలాంటి వ్యవహారంతో ప్రజలకు సరైన సమాచారం చేరడంలో అంతరాయం కలుగుతుందని, అలాగే ప్రజాప్రతినిధుల పాత్రను తగ్గించినట్లుగా భావించాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్, అధికారులు భవిష్యత్తులో ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో జరిగే కార్యక్రమాలకు సంబంధిత నాయకులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని మన్నె లక్ష్మి డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్‌కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...