పటాన్ చెరు, డిసెంబర్ 17 (SNM NEWS): ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు కాంగ్రెస్ నాయకులకు కమిషనర్, అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వడం లేదని పటాన్ చెరు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, ఆత్మ కమిటీ డైరెక్టర్ మన్నె లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అధికారిక సమావేశాలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మున్సిపల్ కమిషనర్, అధికారులు ఎలాంటి సమాచారం అందించడం లేదని ఆరోపించారు. ఇలాంటి వ్యవహారంతో ప్రజలకు సరైన సమాచారం చేరడంలో అంతరాయం కలుగుతుందని, అలాగే ప్రజాప్రతినిధుల పాత్రను తగ్గించినట్లుగా భావించాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్, అధికారులు భవిష్యత్తులో ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో జరిగే కార్యక్రమాలకు సంబంధిత నాయకులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని మన్నె లక్ష్మి డిమాండ్ చేశారు.

No comments:
Post a Comment