Thursday, December 18, 2025

డ్రగ్స్ నిర్మూలన పై కళా ప్రదర్శన సాంస్కృతిక సారథి కళాజాత

సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య  ఆదేశాల మేరకు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారిని విజయలక్ష్మి  పర్యవేక్షణలో సంగారెడ్డి జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు సదాశివపేట మండలం వెల్టూరు గ్రామంలో కళా ప్రదర్శన నిర్వహించారు. చదువు యొక్క ప్రాముఖ్యత, డ్రగ్స్, మూఢనమ్మకాల నిర్మూలన, పచ్చదనం పరిశుభ్రత వంటి తదితర అంశాలపై కళారూపాలతో అవగాహన కల్పించారు. యువత విద్యార్థులు గంజాయి డ్రగ్స్ వంటి ద్రవ్యాలకు అలవాటు పడకూడదని తెలిపారు. డ్రగ్స్ వాడడం వలన కలిగే అనర్ధాలను వివరించారు. విద్యార్థుల కదలికలపై తల్లిదండ్రుల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చదువు వలన సమాజంలో మంచి గుర్తింపు హోదా గౌరవం లభిస్తాయని వివరించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా మార్చాలని అన్నారు. అప్పుడే అనారోగ్య సమస్యలకు గురి కాకుండా ఉంటారని తెలియజేశారు. దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని సూచించారు. బహిరంగ మలవిసర్జనకు స్వస్తి పలకాలని కోరారు. డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ హెపటైటిస్ వంటి జబ్బులు రాకుండా ఉండాలంటే గ్రామాన్ని పరిశుభ్రంగా మార్చడం వల్ల సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. కళాకారులు ఎ. సునీల్ కుమార్, డి. రమేష్, ఎస్. మల్లేష్, జి. బిక్షపతి, బి. నవీన్ కుమార్, ఎన్. రవిందర్, పి. సంధ్య పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...