Friday, December 19, 2025

మధుమేహ వ్యాధిగ్రస్తులు కుంకుమ పువ్వు

 

హైదరాబాద్, డిసెంబర్‌ 19 (SNM NEWS): ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మసాలా దినుసు ఏదంటే టక్కున గుర్తొచ్చేది కుంకుమపువ్వు. ఈ పువ్వు ఉత్పత్తికి సాగు చేసే విధానం కారణంగా, కుంకుమపువ్వు ధర అత్యధికంగా ఉంటుంది. నిజానికి.. ఇతర మసాలా దినుసుల కంటే కుంకుమపువ్వు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ. అవేంటో తెలుసుకుందాం.. కొన్నిసార్లు కోపం రావడం, కొన్నిసార్లు ఏడవడం.. ఇలాంటి మానసిక కల్లోలం తరచుగా రావడం అస్సలు మంచిది కాదు. ఈ పరిస్థితిలో కుంకుమపువ్వు సహాయం తీసుకోవచ్చు. కుంకుమపువ్వు మనస్సును ఆరోగ్యంగా ఉంచుతుందని, డిప్రెషన్‌ లక్షణాలను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆందోళనను తగ్గించడంలోనూ కుంకుమ పువ్వు సహాయపడుతుంది. కుంకుమపువ్వులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. కుంకుమపువ్వు తినడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్‌ వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఆహారంలో కుంకుమపువ్వును తప్పక తీసుకోవాలి. ముఖ్యంగా కుంకుమపువ్వు మహిళల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రీ-మెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌ సమస్యకు కుంకుమపువ్వు మేలు చేస్తుంది. అంటే రుతుక్రమం రాకముందే కలిగే మానసిక, శారీరక ఆనారోగ్యాన్ని కుంకుమపువ్వు దూరం చేస్తుంది. కాలు నొప్పి, మూడ్‌ స్వింగ్స్‌ వంటి లక్షణాలను నియంత్రిస్తుంది. రోజూ కుంకుమపువ్వు కలిపిన టీ లేదా పాలు తాగడం వల్ల బరువు కూడా తగ్గవచ్చు. కుంకుమపువ్వు ఆకలిని అణిచివేసి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ మసాలాలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఊబకాయాన్ని నివారిస్తాయి. జీవక్రియ రుగ్మతలను తొలగిస్తాయి. కుంకుమపువ్వు గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కుంకుమపువ్వులోని యాంటీఆక్సిడెంట్‌ కంటెంట్‌ కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్‌ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

No comments:

Post a Comment

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...