సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 15 (SNM న్యూస్): సంగారెడ్డిలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వనభోజన కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తనయుడు బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింత సాయినాథ్ హాజరయ్యారు. పద్మశాలి బంధువులు, సంఘ పెద్దలను చింత సాయినాథ్ ఆప్యాయంగా పలకరిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు, పెద్దలకు, యువతకు ధన్యవాదాలు తెలుపుతూ.. సంఘ ఐక్యతను మరింత బలోపేతం చేయాలని అయన సూచించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘ ప్రతినిధులు చింతసాయినాథ్ని సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమాలతో వనభోజన వేడుక సందడిగా ముగిసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత రాష్ట్ర పద్మశాలి సంఘం జనరల్ సెక్రెటరీ మాచర్ల రామచంద్రరావు, ఆల్ ఇండియా డాక్టర్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ సోమచంద్రశేఖర్, జిల్లా గౌరవ అధ్యక్షుడు పండరి, జిల్లా అధ్యక్షులు కొప్పెర హరి హర కిషన్, జిల్లా జనరల్ సెక్రెటరీ తాటికొండ అశోక్, అధ్యక్షుడు పట్టణ అధ్యక్షుడు గజేంద్ర కృష్ణ, జనరల్ సెక్రెటరీ సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు మంజుల, సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం నాయకులు కూలిపాక యాదగిరి, సోమ రమేష్, పుండరీకం, రాఘవులు, ముత్యాల ప్రసాద్, సాయి ప్రసాద్ శ్రీశైలం, గడ్డం శ్రీశైలం, బలరాం, మేకల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment