Wednesday, September 03, 2025

రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి -ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 3 (SNM NEWS): రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. బుధవారం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి సదాశివపేట ఏఓ రమేష్ తో ఫోన్ లో మాట్లాడి యూరియా కొరత పై ఆరా తీశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరా చేయాలని సూచించారు. యూరియా స్టాక్ అందుబాటులో ఉంచాలని  రైతులను యూరియా కోసం ఇబ్బంది పెట్టకూడదని పేర్కొన్నారు. స్టాక్ ఎంత ఉంది అని అడిగి తెలుసుకున్నారు. యూరియా కోసం రైతులను క్యూ లైన్ లో, చెప్పులు ఉంచకుండా యూరియా సరఫరా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ రత్నాకర్ రెడ్డి ఉన్నారు.


No comments:

Post a Comment

నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు

  సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...