సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 8 (SNM NEWS ): జిల్లాలో రహదారుల సౌకర్యం లేని గిరిజన తండాలలో రహదారులకు అనుసంధానమైయేలా ఎస్టీ-ఎస్ డి ఎఫ్ నిధులతో చేపట్టబోయే రహదారి నిర్మాణాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలోని మినీసమావేశ మందిరంలో గిరిజనశాఖ ,పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి శాఖ ఇంజనీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ కల్లెక్టర్, పి.ప్రావీణ్య, అదనపు కల్లెక్టర్ ( స్థానిక సంస్థలు ) చంద్రశేఖర్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి లు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు కనెక్టివిటీ లేని గిరిజన తండాలను గుర్తించి, వాహనాలు కూడా నడవలేని రోడ్లకు, ముఖ్యంగా పీడబ్ల్యుడి రోడ్ల నిర్మాణానికి ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించారు. ఇందుకోసం ఎస్టీ-ఎస్ డి ఎఫ్ నిధులను వినియోగించాలి. సంబంధిత, గిరిజనశాఖ, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి శాఖ ఇంజనీరింగ్ అధికారులు తక్షణమే సమగ్ర నివేదికలు సిద్ధం చేసి సమర్పించాలి. టెండర్ ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి, పనులు ప్రారంభించాలి అని ఆదేశించారు. ప్రతి తండాకు అవసరమైన రహదారి పొడవు, అంచనా వ్యయం,సాంకేతిక సమస్యలపై వివరమైన నివేదికలను రెండు వారాల్లోగా సమర్పించాలని ఆదేశించారు. తక్షణం అమలు చర్యలు ప్రారంభించాలని సూచించారు. వర్షాకాలంలో రహదారులు సరిగా లేకపోవడం వలన గిరిజన కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్య సేవలు, విద్య, అత్యవసర సేవలు సమయానికి అందకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. సమస్యల పరిష్కారం కోసం ఎస్టీ-ఎస్ డి ఎఫ్ నిధులు వినియోగించి తక్షణమే రహదారుల ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ టి జి ఈ డెబ్ల్యు ఐ డి సి ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను కూడా సమీక్షించారు. అంగన్వాడి కేంద్రాలు, గ్రామపంచాయతీ భవనాలు, కళాశాలలు, పాఠశాలల్లో టాయిలెట్స్, నిర్మాణం వంటి పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పాఠశాలలో టాయిలెట్స్ నిర్మాణం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో గిరిజన శాఖ ఇంజనీరింగ్, ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులు, పంచాయతీ రాజ్, విద్యాశాఖ, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.
ప్రాంతీయ నుంచి జాతీయ స్థాయి వరకు తాజా రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, సమాజం, విద్య, ఉద్యోగాలు, క్రీడలు, ప్రత్యేక కథనాలను నిష్పక్షపాతంగా అందించే విశ్వసనీయ తెలుగు న్యూస్ బ్లాగ్. నిజమైన వార్తలతో ప్రజల గళంగా నిలుస్తుంది.
Monday, September 08, 2025
ప్రతి తండాకు రోడ్డు కల్పన లక్ష్యంగా ప్రభుత్వ చర్యలు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
Subscribe to:
Post Comments (Atom)
అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం
సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...
-
సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు జంగమ అర్చక ప...
-
సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అ...
-
సంగారెడ్డి అక్టోబర్ 22 (ఎస్ఎన్ఎం న్యూస్): సంగారెడ్డి నుంచి తిరుపతి కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల వరకు మహా పాదయాత్ర వెళ్లిన సాహితీ రాము...

No comments:
Post a Comment