Wednesday, September 03, 2025

రెండవ విడత సాధారణ ఎన్నికల ఓటర్ల జాబితా తుది ప్రచురణ విడుదల


జిల్లా పంచాయతీ అధికారి సాయి బాబా

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 2 (సిరి న్యూస్):

సంగారెడ్డి జిల్లాలో జరగబోయే గ్రామ పంచాయతీల రెండవ విడత సాధారణ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా తుది ప్రచురణ విడుదల చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి  సాయి బాబా గారు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వివరాలు తెలియజేస్తూ జిల్లాలో మొత్తం మండలాలు  25, గ్రామ పంచాయతీలు  613, మొత్తం వార్డులు  5370, మొత్తం పోలింగ్ స్టేషన్లు  5370, మొత్తం ఓటర్లు  7,44,157, పురుషులు  3,68,270, మహిళలు  3,75,843, ఇతరులు 44,జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తారని ఆయన తెలిపారు.

No comments:

Post a Comment

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్‌కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...