జిల్లా పంచాయతీ అధికారి సాయి బాబా
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 2 (సిరి న్యూస్):
సంగారెడ్డి జిల్లాలో జరగబోయే గ్రామ పంచాయతీల రెండవ విడత సాధారణ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా తుది ప్రచురణ విడుదల చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి సాయి బాబా గారు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వివరాలు తెలియజేస్తూ జిల్లాలో మొత్తం మండలాలు 25, గ్రామ పంచాయతీలు 613, మొత్తం వార్డులు 5370, మొత్తం పోలింగ్ స్టేషన్లు 5370, మొత్తం ఓటర్లు 7,44,157, పురుషులు 3,68,270, మహిళలు 3,75,843, ఇతరులు 44,జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తారని ఆయన తెలిపారు.

No comments:
Post a Comment