సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 19 (సిరి న్యూస్):
సంగారెడ్డిలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం శనివారం రోజు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సెంట్రల్ జోన్ కమిటీ మెంబర్ మిట్టపల్లి రాజేశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్. తెలంగాణ సెంట్రల్ జోన్ కమిటీ మెంబర్ సాల్మన్ రాజు పాల్గొంటారని ఆయన సూచించారు. అదేవిధంగా పటాన్చెరువు, సంగారెడ్డి, అందోల్, నర్సాపూర్, మెదక్, జహీరాబాద్, నారాయణఖేడ్, తదితర ప్రాంతాలతో పాటు ప్రజలు కార్యకర్తలు యువకులు మహిళలు పాల్గొనాలని ఆయన సూచించారు. పార్టీ కార్యాలయం ఆఫీసు సాయిబాబా మందిరం పక్కన ఉందని ఆయన వెల్లడించారు. అదేవిధంగా జిల్లా కార్యకర్తల సమావేశం కూడా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పార్టీ నాయకులు తప్పకుండా హాజరుకావాలని ఆయన సూచించారు.

No comments:
Post a Comment