సంగారెడ్డి ప్రతినిధి, ఆగష్టు 30 (SNM NEWS):
సంగారెడ్డి జిల్లాలో ఓ విద్యార్థిని షూలో పాము ప్రత్యక్షమైన సంఘటన చోటుచేసుకుంది. మెదక్ జిల్లాకు చెందిన ఓ యువతి సంగారెడ్డిలోని బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో చదువుతోంది. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం కళాశాలకు వెళ్లేందుకు హాస్టల్ వద్ద ఆ విద్యార్థిని షూ వేసుకుంటుండగా అందులో పాము కనిపించింది. దాంతో ఆమె ఒక్కసారిగా భయాందోళనకు గురై షూ ను దూరంగా విసిరేసింది. పాము షూ నుంచి బయటకు రాగా కర్రతో కొట్టి చంపారు. పాము షూ లోకి రావడంతో హాస్టల్ లో ఉన్న విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. నర్సింగ్ కళాశాల హాస్టల్ కు పక్కా భవనం లేకపోవడంతో మహిళా ప్రాంగణంలో కొనసాగిస్తున్నారు. అయితే హాస్టల్ లోకి తరచుగా పాములు వస్తున్నాయని విద్యార్థినులు చెబుతున్నారు.
No comments:
Post a Comment