హైదరాబాద్, డిసెంబర్ 19 (SNM NEWS): మైగ్రేన్ తగ్గిపోవాలంటే క్రమంగా కెఫిన్ తీసుకోవడం ఖచ్చితంగా తగ్గించాలి.ఎల్లప్పుడూ కూడా హైడ్రేటెడ్ గా ఉండాలి. అలాగే ఖచ్చితంగా ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ను మైంటైన్ చేస్తూ ఉండాలి.ఇంకా అలాగే యోగా వంటి వ్యాయామాలు అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా సమయానికి నిద్రపోవాలి.అధిక ఉష్ణోగ్రతలు గాలి నాణ్యతను మరింత దిగజార్చుతాయి. ఇది కాలుష్యం, అలెర్జీ కారకాలకు దారితీస్తుంది. కొంతమందికి ఈ వాతావరణ మార్పు సైనస్ తలనొప్పిని ప్రేరేపిస్తుంది. మైగ్రేన్ పరిస్థితులను తీవ్రతరం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. మైగ్రేన్ రిస్క్ తగ్గాలంటే కొన్ని ఆహారాలు, పానీయాలు మానుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.కార్బోనేటేడ్ డ్రిరక్స్, ఎనర్జీ డ్రిరక్స్ ఇంకా కాఫీ మైగ్రేన్లను తీవ్రతరం చేస్తాయి. కొంతమందికి వేసవిలో మైగ్రేన్లు ఎక్కువ అవుతాయి. ఇది ప్రధానంగా అధిక ఉష్ణోగ్రత, తేమ, పగటిపూట సూర్యరశ్మికి గురికావడం వంటి కారణాల వల్ల జరుగుతుంది. కెఫీన్ కొందరిలో మైగ్రేన్లను మరింత తీవ్రతరం చేస్తుంది. కెఫిన్ కలిగిన పానీయాల వినియోగం వల్ల మైగ్రేన్లు, తేలికపాటి నిర్జలీకరణంపై ప్రత్యక్ష ప్రభావం వల్ల తలనొప్పి రావచ్చు. సన్స్క్రీన్ లోషన్స్ లేదా పెస్టిసైడ్స్లోని కొన్ని రసాయనాలు వాటి బలమైన సువాసనల కారణంగా మైగ్రేన్ బాధితులలో తలనొప్పిని ప్రేరేపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. వేసవి కాలంలో తలనొప్పులు రావడానికి ప్రధాన కారణం ఉష్ణోగ్రతలు పెరగడమే అంటున్నారు వైద్యులు. డీహైడ్రేషన్ మైగ్రేన్లకు కారణమవుతుంది. విపరీతమైన వేడి డీహైడ్రేషన్కు దారితీస్తుంది. మీరు ఉపశమనం కోసం మాత్రను తీసుకునే ముందు మీ శరీరం బాగా హైడ్రేట్ అయ్యిందని నిర్ధారించుకోండి. అప్పుడు నీరు పుష్కలంగా తాగాలి. ఎలక్ట్రోలైట్స్ కోల్పోకుండా ఉండటానికి నిమ్మకాయ నీటిలో ఉప్పు కలుపుకుని తాగితే మంచిది.మైగ్రేన్ సమస్య చాలా మందిని కూడా ఎంతగానో ఇబ్బంది పెడుతుంది. వేసవి కాలంలో మైగ్రేన్ బాధితుల సంఖ్య పెరుగుతుందని అనేక నివేదికలు సూచిస్తున్నాయి. వేసవి కాలంలో మైగ్రేన్లు మరింత తీవ్రమవుతాయి కాబట్టి ఖచ్చితంగా పైన పేర్కొన్న జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి.
ప్రాంతీయ నుంచి జాతీయ స్థాయి వరకు తాజా రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, సమాజం, విద్య, ఉద్యోగాలు, క్రీడలు, ప్రత్యేక కథనాలను నిష్పక్షపాతంగా అందించే విశ్వసనీయ తెలుగు న్యూస్ బ్లాగ్. నిజమైన వార్తలతో ప్రజల గళంగా నిలుస్తుంది.
Friday, December 19, 2025
Subscribe to:
Post Comments (Atom)
అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం
సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...
-
సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు జంగమ అర్చక ప...
-
సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అ...
-
సంగారెడ్డి అక్టోబర్ 22 (ఎస్ఎన్ఎం న్యూస్): సంగారెడ్డి నుంచి తిరుపతి కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల వరకు మహా పాదయాత్ర వెళ్లిన సాహితీ రాము...

No comments:
Post a Comment