Sunday, July 05, 2026

36 ఏళ్ల విశిష్ట సేవలకు ముగింపు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి పల్గటి మాణిక్యం - ప్రవీణ కు ఘన సన్మానం

మెదక్, జూలై 4 (ప్రతినిధి): మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో సుదీర్ఘకాలం సేవలందించిన ఉద్యోగి పల్గటి మాణిక్యం ఉద్యోగ విరమణ సందర్భంగా ఘనంగా సన్మానించారు. 1990 మే 10న ఉద్యోగంలో చేరిన ఆయన సుమారు 36 సంవత్సరాలపాటు అంకితభావంతో, క్రమశిక్షణతో, నిజాయితీతో విధులు నిర్వర్తించి, 2026 జూన్ 30న పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన సభకు టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పల్గటి మాణిక్యం ప్రవీణ దంపతులను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘకాలం ప్రజాసేవలో నిబద్ధతతో పనిచేసిన ఆయన సేవలను కొనియాడిన ఆమె, పదవీ విరమణ అనంతరం వారి జీవితమంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో నిండి ఉండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఆనందోత్సాహాలతో శేష జీవితాన్ని గడపాలని అభిలషించారు. సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో కుటుంబ అభ్యున్నతితో పాటు సంస్థ అభివృద్ధికి విశేష కృషి చేసి ఆదర్శ ఉద్యోగిగా గుర్తింపు పొందిన పల్గటి ప్రవీణ్ సేవలను కుటుంబ సభ్యులు ప్రశంసించారు. ఆయన పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా జీవించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమార్తెలు పి. శిరీష, పి. సహజ, కుమారుడు పి. తరుణ్, అల్లుడు సైమన్ అరోనోయల్, మనుమడు వంశీకృష్ణతో పాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొని పల్గటి మాణిక్యం- ప్రవీణకు ఘనంగా అభినందనలు తెలిపారు.

No comments:

Post a Comment

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్‌కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...