Wednesday, June 17, 2026

టాలెంట్ టెస్ట్ విజేతలకు నగదు బహుమతుల ప్రదానం

 

-నాణ్యమైన విద్యతో విద్యార్థుల్లో సమగ్ర వికాసమే లక్ష్యం

-కృష్ణవేణి హైస్కూల్ ప్రిన్సిపల్ కృపానిధి పరీదా

సంగారెడ్డి : విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, భాషా నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసాన్ని అందించాలనే లక్ష్యంతో కృపానిధి కృష్ణవేణి హైస్కూల్ వినూత్న విద్యా విధానాలను అమలు చేస్తోందని పాఠశాల యాజమాన్యం తెలిపింది. 2026–27 విద్యా సంవత్సరానికి నర్సరీ నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై పట్టు పెంపొందించేందుకు ఐఎల్టీఎస్ ఇంగ్లీష్, ఫోనిక్స్, స్పోకెన్ ఇంగ్లీష్, ఫ్లూయెన్సీ ఇంగ్లీష్, ఇంటరాక్టివ్ ఇంగ్లీష్, కాలిగ్రఫీ, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, వ్యాకరణ నైపుణ్యాలు, పదజాల అభివృద్ధి వంటి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. భవిష్యత్ పోటీ ప్రపంచాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించింది. అత్యాధునిక డిజిటల్ క్లాస్‌రూమ్స్, సైన్స్ ల్యాబ్‌లు, రోబోటిక్స్ శిక్షణ, కంప్యూటర్ విద్య, స్కేటింగ్, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కార్యాచరణ ఆధారిత బోధన ద్వారా విద్యార్థులకు సమగ్ర విద్యను అందిస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. అలాగే తల్లిదండ్రుల కోసం ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ తరగతులను కూడా నిర్వహించనున్నట్లు తెలిపింది. 




విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే ఉద్దేశంతో జూన్ 10న నిర్వహించిన స్కాలర్‌షిప్ టాలెంట్ టెస్ట్–2026కు విశేష స్పందన లభించిందని పేర్కొంది. ఈ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులను ప్రదానం చేశారు. విజేతలు ప్రథమ బహుమతి: నాగ అనీష్ వేద నిమిత్రూ – రూ.15,000, ద్వితీయ బహుమతి: కే. యశ్వంత్ – రూ.10,000, తృతీయ బహుమతి: కే. నవదీప్ చారి – రూ.5,000  అదనంగా, టాలెంట్ టెస్ట్‌లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రోత్సాహక బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేయనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. పరీక్ష సందర్భంగా విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంపొందించేందుకు బోటింగ్, బబుల్ హౌస్, అమ్యూజ్‌మెంట్ గేమ్స్, వినోదాత్మక పోటీలు, సృజనాత్మక కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో చిన్నారులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ, పుస్తక విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, భాషా ప్రావీణ్యం, సాంకేతిక పరిజ్ఞానం, నైతిక విలువలు కలిగిన విద్యార్థులను తీర్చిదిద్దడమే మా లక్ష్యం. విద్యార్థుల ప్రతిభను వెలికితీసి ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నాం అని పేర్కొంది. ప్రవేశాలు పరిమిత సీట్లతో కొనసాగుతున్నందున, ఆసక్తి గల తల్లిదండ్రులు ముందస్తుగా తమ పిల్లలను నమోదు చేసుకోవాలని కృపానిధి కృష్ణవేణి పాఠశాల ప్రిన్సిపల్ కృపానిధి పరీదా విజ్ఞప్తి చేసారు.

No comments:

Post a Comment

ఏవీఎన్‌ఎల్–ఓఎఫ్‌ఎంకేలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

  ఎద్దుమైలారం, జూన్ 21: ఎద్దుమైలారంలోని ఏవీఎన్‌ఎల్–ఓఎఫ్‌ఎంకే ఎస్టేట్ పరిధిలోని శరత్ యోగా కేంద్రంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా న...