సంగారెడ్డి, నవంబర్ 21 (ఎస్ఎన్ఏం న్యూస్): భద్రాద్రి జిల్లాలో జరిగిన ఎస్జీఎఫ్ క్రీడా పోటీల్లో భాగంగా నిర్వహించిన షూటింగ్ పోటీలో సంగారెడ్డి టీం సభ్యులు పాల్గొన్నారు. పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో భద్రాది కొత్తగూడెం జిల్లా స్థాయి తుపాకీ షూటింగ్ అండర్-14, 17 విభా గాల్లో బాల, బాలికలు పోటీలు నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి వచ్చిన విద్యా ర్థులు షూటింగ్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తుపాకీతో గురిని పేల్చారు. రైఫిల్ షూటింగ్లో కోచ్ శశ్వంత్ ఆధ్వర్యంలో విద్యార్థులు బహుమతులు గెలుపు పొందారని తెలిపారు. జాతీయ స్థాయిలో జిల్లా టీం ప్రాతినిధ్యం వహించేలా కృషి చేస్తామని షూటింగ్ జిల్లా కార్యదర్శి శేశ్వంత్ తెలిపారు. అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చేతులమీదుగా సర్టిఫికెట్లు పట్నం శెట్టి సాయి చరణ్ టీం అందుకున్నారు.

No comments:
Post a Comment