సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 30 (SNM NEWS): సంగారెడ్డిలోని శివాజీ నగర్ లో శౌర్య యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి పట్టణానికి చెందిన అనుముల సంజన, అనుముల సంతోష్ కుమార్ దంపతుల ఆధ్వర్యంలో కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో అంగర వైభవంగా జరిపించారు. అనంతరం సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు పిట్టల రమేష్ సభ్యులు ద్వారక రవి శివ, మహేష్ చారి, చారి, రేవంత్, భాను, శేఖర్, చిన్న తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment