Tuesday, February 10, 2026

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

 

సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తూ, అవసరంలో ఉన్న ఓ నిరుపేద కార్మికుడికి తక్షణ ఆర్థిక సహాయం అందించి ఆదర్శంగా నిలిచారు. సంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్, శివాజీ నగర్ ప్రాంతంలో బైక్‌పై వెళ్తున్న జగ్గారెడ్డికి రోడ్డుపక్కన చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ కార్మికుడు కనిపించాడు. వెంటనే తన వాహనాన్ని వెనక్కి తిప్పి ఆ కార్మికుడి వద్దకు వెళ్లిన ఆయన, అతని జీవన పరిస్థితులను తెలుసుకున్నారు. వాన, ఎండలకు తడుస్తూ రోడ్డుపక్కనే చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నానని, సరైన నీడ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని కార్మికుడు జగ్గారెడ్డికి విన్నవించాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పనికి అవసరమైన సామగ్రి కూడా కొనుగోలు చేయలేకపోతున్నానని, కొంత సహాయం అందితే తన ఉపాధి మెరుగుపడుతుందని వివరించాడు. కార్మికుడి పరిస్థితిని గమనించిన జగ్గారెడ్డి, అతని జీవనోపాధికి అండగా నిలవాలనే ఉద్దేశంతో వెంటనే రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని చెప్పులు కుట్టే పనిముట్లు, నీడ ఏర్పాటు తదితర అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు.

Monday, February 09, 2026

ఇంటింటి ప్రచారంలో జోష్ 37 వార్డు కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థి ఠాకూర్ రమేష్ సింగ్

 సంగారెడ్డి, ఫిబ్రవరి 8 (SNM NEWS):సంగారెడ్డి మున్సిపాలిటీలో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. మున్సిపాలిటీలోని 37వ వార్డు స్వతంత్ర అభ్యర్థి ఠాకూర్ రమేష్ సింగ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మీ ఇంటి సేవకుడిగా, పనిచేస్తానని పదవి కోసం రాలేదని 37వ వార్డు ప్రగతి కోసం వచ్చానని నన్ను గెలిపిస్తే కౌన్సిలర్ అవుతా కానీ ఎప్పటికీ మీ మనిషిగా ఉంటూ సేవ చేసుకుంటారని అన్నారు. 37వ వార్డు అభివృద్ధి చేసి చూపిస్తానని ఓటర్లకు వివరించారు. వార్డు అభివృద్ధికి స్వచ్ఛందంగా కృషి చేస్తానని అన్నారు. కాలనీవాసులో తన ప్రచారానికి సహకరిస్తున్నట్లు తెలిపారు. ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి చేయూతనివ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

నాయి కోటి అశ్విని నవీన్ కుమార్ లభిస్తున్న ప్రజా ఆదరణ -గడపగడపకు బీఆర్ఎస్ ప్రచారం

 


సంగారెడ్డి, ఫిబ్రవరి 8 (SNM NEWS): సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ 32వ వార్డు అభ్యర్థి నాయి కోటి అశ్విని సవీన్ కుమార్ ఇంటింటికి తిరిగి కార్యకర్తలతో ప్రచారం చేశారు. మున్సివల్ 32 వ వార్డు అభ్యర్థి నాయికోటి అశ్వని కుమార్ మాట్లాడుతూ గత కాలంలో మేము చేసిన అభివృద్ధి మీ అందరూ చూశారు. కరోనా కష్టకాలంలో కూడా వ్రతి ఇంటికి తిరిగి శానిటైజషన్ చేయడం జరిగింది. గత ఎలక్షన్లో మాట ఇచ్చిన విధంగా గత ఏడు సంవత్సరాలుగా ప్రతి! ఇంటికి రోజు మంచినీటి సరఫరా మరియు సొంత నిధులతో టాంకర్ ద్వారా నీటి సరఫరా చేస్తున్నామన్నారు. ప్రతి వీధికి సిసి రోడ్డు డ్రైనేజీ వీధి దీపాలు ఏర్పాటు చేసి వార్డు రేఖలను మార్చాము. వార్డు ప్రజల సౌలభ్యం కోసం కలెక్టర్ వెనకాల పార్కును ఏర్పాటు చేశాము. వాటర్ ట్యాంక్ నిర్మించామని, డ్వాక్రా మహిళల కోసం డ్వాక్రా బిల్డింగ్ నిర్మించి మహిళల ఆత్మగౌరవం పెంచామని అన్నారు. గతంలో చేసిన విధంగానే రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మన వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని మాట ఇస్తున్నామని తెలియజేశారు. పాలకుడిగా కాదు ప్రజా సేవకుడిగా ఉంటాను. అందరూ గర్వపడేలా పనిచేస్తాను మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను సన్ను అధిక మెజారిటీతో గెలిపించగలరని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు కాలనీవాసులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

సదాశివపేటలో జయమ్మ... సంగారెడ్డిలో నిర్మలమ్మ -కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న తల్లీ కూతుళ్ళు

 



-8 కోట్ల తో ఒక్కో వార్డులో అభివృద్ధి, పేదలకు ఇంటి స్థలాల హామీతో ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్

సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 8 (SNM NEWS):మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి రెండు రోజుల్లో తెర పడనుండటం తో  కాంగ్రెస్ పార్టీ ప్రచారం లో దూకుడు పెంచింది. సంగారెడ్డి లో శనివారం జరిగిన  ప్రజలతో జగ్గారెడ్డి ముఖాముఖి  సభ వియవంతం కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఆదివారం ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు.  సదాశివపేట లో జయా చైతన్య రెడ్డి,    సంగారెడ్డి లో నిర్మలా జగ్గారెడ్డి ఇంటిటి  ప్రచారం లో పాల్గొన్నారు. టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల తరపున  పట్టణం లో ని 11,31,32,33,6 వ వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థులను   గెలిపిస్తే ప్రతీ వార్డులో 8 కోట్ల రూపాయల తో అభివృద్ధి చేయడం తో పాటు వార్డులో ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలాలు ఇప్పిస్తామన్నారు. మీ మనస్సు మాట వినండి, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేయాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. మరో పక్క సదాశివపేట మున్సిపాలిటీ లో జయా చైతన్య రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు.17,18,4,8 వార్డులతో పాటు పలు వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జయారెడ్డి మాట్లాడుతూ  ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి జగ్గారెడ్డి అని, ఆయన  మాట ఇస్తే చేసి తీరుతారని అన్నారు. సదాశివపేట  లో సర్టిఫికెట్లు ఉన్న 5500 మందికి తో పాటు ఇల్లు లేని ప్రతీ పేదలకు ఇంటి స్థలాలు జగ్గారెడ్డి ఇచ్చి తీరుతారాన్నరు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ప్రతీ వార్డులో 8 కోట్ల రూపాయల తో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం లో ఆయా వార్డుల అభ్యర్థులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sunday, February 08, 2026

పులిమామిడి మమత గెలుపు కొరకు కష్టపడుతున్న రాజన్న మిత్రులు

 

 సదాశివపేట, ఫిబ్రవరి 8 (SNM NEWS): సదాశివపేట పట్టణంలోని 12 వ వార్డు నుండి పోటీ చేస్తున్న పులిమామిడి మమత రాజు దంపతుల గెలుపుకొరకు కృషి చేస్తున్న రాజన్న మిత్రబృందం ఖర్చర్ల హరీష్ కుమార్, సుభాష్, పోల ప్రభు.ఇట్టి సందర్భంగా ఖర్చర్ల హరీష్ కుమార్ మాట్లాడుతూ మా అన్న 12 వ వార్డులో చేసినటువంటి సేవలు మేము ఎన్నటికీ మరచి పోలేమని, మా వార్డు నందు పులిమామిడి రాజన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఏదోఒక రకంగా  తమ సహాయాన్ని అందించారని, వార్డునందు రోడ్లు గాని, మంచి నీటి సదుపాయం, మిషన్ భగీరథ ద్వారా నల్లకనెక్షన్ గాని, పింఛన్లు, షాదిమూభారక్, కళ్యాణ లక్షి, డ్రైనేజీ వ్యవస్థ, ఇందిరమ్మ ఇండ్లను సాంక్షన్ చేయించారు. ఇన్ని కార్యక్రమాలు అందిందించిన మా అన్న పులిమామిడి రాజన్న సతీమణి ఐన పులిమామిడి మమత యొక్క చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించగలని వారు ఓటరు మహాషయులను విజ్ఞప్తి చేశారు. ఇట్టి కార్యక్రమంలో వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Saturday, February 07, 2026

అభివృద్ధి కావాలంటే బ్యాట్ గుర్తుకు ఓటు వేయండి. ..ఆశీర్వదించండి గొల్ల విజయలక్ష్మి–ఆంజనేయులు

 

సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 6 (SNM NEWS): సంగారెడ్డి పట్టణ 30వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ అభ్యర్థి గొల్ల విజయలక్ష్మి–ఆంజనేయులు మాట్లాడుతూ, “ఒక్క అవకాశం ఇవ్వండి… వార్డు అభివృద్ధి చేసే పూర్తి బాధ్యత నాదే” అని ప్రజలను కోరారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంతోష్ నగర్, సాయి కృప నగర్, అయ్యప్ప కాలనీలలో రహిమత్ నగర్ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ, వార్డు సమస్యలను తెలుసుకున్నారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల మధ్యే ఉంటూ, ప్రజల కోసం పనిచేసే కౌన్సిలర్‌గా నిలుస్తానని, పార్టీలకు అతీతంగా అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఆమె పేర్కొన్నారు. స్వచ్ఛమైన పాలన, పారదర్శకతతో 30వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో జనార్ధన్, తుల్జారాం, అజీజ్,సాయి కృప, అఖిల్, శ్రీధర్, తూర్పు ఆంజనేయులు, అరుణ్ చారి, కృష్ణ, ఆశిష్, వంశీ, సాయి తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు.

పులిమామిడి మమత తరపున 12వ వార్డు నందు ప్రచారంలో పాల్గొన్న TGIIC చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి


సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 6 (SNM NEWS): సదాశివపేట పట్టణంలోని పాతకేరి నందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులిమామిడి మమత పక్షాన టి.జి. ఐఐసీ చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి గారు పాల్గొన్నారు. ఇట్టి సందర్భంగా వారు మాట్లాడుతూ గతకాలంలో కూడా పులిమామిడి రాజు 12 వ వార్డు ప్రజలకు ఎంతగానో సేవా కార్యక్రమాలు నిర్వహించారని, 12 వ వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, ప్రభుత్వం ద్వారా వచ్చిన పథకాలను కూడా ప్రజలకు అందజేసేలా చూశారాని వారి లాంటి మంచి మనసున్న వ్యక్తి మీకు దొరకడం 12 వ వార్డు ప్రజల అదృష్టమని నిర్మల జగ్గారెడ్డి గారు అన్నారు. ఈ సారి బి.సి మహిళ వచ్చిన సందర్భంగా వారి సతీమణి పులిమామిడి మమత కాంగ్రెస్ పార్టీ తరపున పోటీలో ఉన్నారని, మళ్ళీ వారిని గెలిపించుకుంటే 12 వ వార్డును మరింత అభివృద్ధి చేస్తారని వారి తరపున నేను హామీ ఇస్తున్నాను. ప్రస్తుతం మన రేవంతన్న ప్రభుత్వం అందుబాటులో ఉందని ప్రజలందరూ ఇట్టి విషయాన్ని గమనించి అధికార పార్టీకి మీ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ అభ్యర్థి పులిమామిడి మమత చేతి గుర్తుకు వేసి వారిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తిచేశారు. 12 వ వార్డులో ఇంతవరకే కారును ప్రజలందరూ కలిసి ఫంచర్ చేశారని, ఈ ఎన్నికల తరువాత పూర్తిగా గ్యారేజికి పర్మనెంట్ గా పంపించగలరని 12 వ వార్డు ప్రజలకు తెలియ పరిచారు. ఇట్టి కార్యక్రమంలో సీడిసి చైర్మన్ గడీల రాంరెడ్డి, చెర్యాల అంజన్న,పట్టణ అధ్యక్షులు మునిపల్లి సత్యనారాయణ,  మండల అధ్యక్షులు చాట్ల సిద్దన్న, 12 వార్డు ఇంచార్జ్ వడ్ల బింబాధర్ చారి, కంది కృష్ణ, వార్డు ప్రజలు, పిఎంఆర్ యువసేన నాయకులు పాల్గొన్నారు.

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...