-విజేతలకు బహుమతులు అందజేసిన టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, ఎం.డి శశాంక
-గచ్చిబౌలి ఐ.ఎస్.బి లో ఘనంగా ముగింపు వేడుకలు
రెండు రోజుల పాటు ఘనంగా జరిగిన టీజిఐఐసి ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్ మూడో రోజైన శుక్రవారం ఉద్యోగుల సాంస్కృతిక వేడుకల తో ముగిసింది. శుక్రవారం గచ్చిభౌలి ఐఎస్ బి లోని ఖేంకా ఆడిటోరియం లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల లో టీజిఐఐసి ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డాన్స్ లు చేస్తూ , పాటలు పాడుతూ ఆనందంగా గడిపారు. అనంతరం రెండురోజుల పాటు జరిగిన క్రీడా పోటీల్లో గెలిచిన విజేతలకు టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, ఎండీ శశాంక లు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులు వీలైనప్పుడల్లా తమ హాబీ లకు పదును పెట్టాలని, తద్వారా మానిసిక ఉల్లాసం పెరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో టీజిఐఐసి ఈడి లు పవన్, వీరారెడ్డి లతో పాటు సంస్థ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


No comments:
Post a Comment