Wednesday, September 17, 2025

పత్తి కొనుగోలు పై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం


 సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 17 (SNM NEWS): 2025-26 సీజన్ పత్తి కొనుగోలు,  సంబంధించి బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్  పి.ప్రావీణ్య, సంబంధిత మిల్లర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ  2025-26 సీజన్ జిల్లా వ్యాప్తంగా  3,48,775ఎకరాల్లో పత్తి సాగు చేయగా 2,79,020 మెట్రిక్  టన్నులు దిగుబడి అంచనా వేయడం జరిగిందని. ఇందుకు తగ్గట్టు గా సజావుగా కొనుగోలు జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. పత్తి కొనుగోలు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఆరు మార్కెటింగ్ యార్డులపరిధిలో 24 జిన్నింగ్ మిల్లుల  నుండి, సి.సి.ఐ. ద్వారా ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం కొనుగోలు  ప్రారంభమయ్యేలా  అధికారులు  చర్యలు  చేపట్టాలని అన్నారు .  సీసీఐకి పత్తి అమ్ముకోవాలంటే ఆధార్ ప్రామాణికత అనేది తప్పనిసరి అని. పత్తి కొనుగోలు  చెల్లింపులను ఆధార్ తో అనుసంధానం అయిన బ్యాంకు ఖాతాలో మాత్రమే జమ చేయడం జరుగుతుందని. జిల్లాలో గల అన్ని జిన్నింగ్ మిల్లులను తనిఖీ చేసి సరిగా ఉండేలా చూడమని కలెక్టర్ ఆదేశించారు. లీగల్ మెట్రాలజీ  శాఖ అధికారులు  జిన్నింగ్ మిల్లులలో  తనిఖీలు నిర్వహించి నిర్వహించాలని అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జీన్నింగ్ మిల్లుల యాజమాన్యం సరైన జాగ్రత్తలు తీసుకునేలా అగ్నిమాపక శాఖ అధికారి విజిట్ చేసి సూచనలు చేయాలన్నారు.జిన్నింగ్ మిల్లులలో రైతులకు కనీస మౌలిక వసతులైన తాగునీరు, నీడ వంటి సదుపాయాలను కచ్చితంగా కల్పించాలని ఆదేశించారు.జిన్నింగ్ మిల్లులలో కొనుగోలు జరిపేటప్పుడు టోకెన్ సిస్టం అమలు చేసి క్రమబద్ధీకరించాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్  మాధురి, జిల్లా మార్కెటింగ్ అధికారి రషీద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి  శివ ప్రసాద్, అగ్నిమాపకశాఖ అధికారులు, జిల్లా రవాణా శాఖ అధికారులు, జీన్నింగ్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...