Sunday, August 31, 2025

అయ్యప్ప కాలనీలో గణ నాధునికి ప్రత్యేక పూజలు

సంగారెడ్డి 30వార్డు అయ్యప్ప కాలనీలో కృష్ణ చైతన్య యూత్ వారి వినాయక మండపంలో గొల్ల ఆంజనేయులు ఆధ్వర్యంలో చింత సాయినాథ్ టౌన్ సీఐ రమేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంగారెడ్డి పట్టణం  30వార్డులో కృష్ణ చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణ నాధుని వద్ద బి ఆర్ ఎస్  నాయకులు గొల్ల ఆంజనేయులు ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో  బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు చింత సాయినాథ్, టౌన్ సీఐ రమేష్ పాల్గొని వినాయకునికి ప్రత్యేక పూజలు జరిపారు.. అనంతరం వారిని ఘనంగా సన్మానించిన గొల్ల ఆంజనేయులు.. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు అనంతయ్య, అరుణ్ చారీ, అఖిల్, తూరుపు ఆంజనేయులు, కృష్ణ, రాజు, నవీన్, మహేందర్ మరియు కృష్ణ చైతన్య యూత్ అసోసియేషన్ సభ్యులు సాయి కిరణ్ వంశీ కోట కార్తీక్ విజయ్ వైద్యనాథ్ శ్రీపాద్ జాషన్ బాలాజీ మరియు స్థానిక 30వార్డు కాలనీ వాసులు మహిళలు యువకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...