రాయికోడ్, జనవరి 23 (SNM న్యూస్): ఎం. పి. పి. స్ రాయికోడ్ పాఠశాలలో నిర్వహించిన జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు విలువను ప్రజలకు తెలియజేయడం, యువతలో ఓటు ప్రాధాన్యతపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవంను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకొని, ఎన్నికల ప్రక్రియలో బాధ్యతాయుతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు,జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేయడం అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడాయి. ప్రజలలో ఎన్నికలపై నమ్మకం పెంపొందించడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. శ్రీనివాస్ తెలిపారు.
అదే విధంగా శుక్రవారం వసంత పంచమి పర్వదినం కూడా కావడంతో, జ్ఞానం, విద్య, కళలకు ప్రతీక అయిన శ్రీ సరస్వతి దేవిని భక్తిశ్రద్ధలతో పూజించారు. వసంత ఋతువు ఆరంభాన్ని సూచించే ఈ పర్వదినం విద్యార్థులలొ నూతనోత్సాహాన్ని నింపుతుంది. జాతీయ ఓటర్ దినోత్సవం మరియు వసంత పంచమి ఒకే రోజున రావడం విశేషమని, జ్ఞానం, బాధ్యతాయుత పౌరసత్వం కలిసి సమాజ అభివృద్ధికి దోహదపడతాయని పాఠశాల ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యాదవులు, సల్మా,తులసి, శ్రావణి,శోభ, విద్యార్థులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment